సీసీ కెమెరాలతో ఆర్మీపై నిఘా.. పాకిస్థాన్కు రహస్యాల చేరవేత!
- పఠాన్కోట్లో గూఢచర్య నెట్వర్క్ను ఛేదించిన పంజాబ్ పోలీసులు
- గత నెలలోనూ ఐఎస్ఐ మద్దతున్న రెండు గూఢచర్య ముఠాల అరెస్ట్
- చైనా తయారీ సోలార్ పవర్డ్ సీసీ కెమెరాలను వాడుతున్న ముఠాలు
- గూఢచర్యంతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్లోనూ నిందితుల ప్రమేయం
పంజాబ్లో పాకిస్థాన్ కోసం పనిచేస్తున్న భారీ గూఢచర్య నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. భారత సైన్యం, పారామిలటరీ బలగాల కదలికలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని హ్యాండ్లర్లకు చేరవేస్తున్న ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జీత్ సింగ్ అలియాస్ బిట్టు పఠాన్కోట్-జమ్మూ జాతీయ రహదారి-44పై ఉన్న ఒక వంతెన సమీపంలోని దుకాణంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే ఆర్మీ వాహనాల కదలికలను నిరంతరం గమనించి, ఆ వీడియో ఫుటేజ్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాకిస్థాన్లోని ఆపరేటివ్లకు పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి దల్జీందర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
విచారణలో బల్జీత్ సింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. జనవరిలో సుజాన్పూర్ సమీపంలోని హైవే వద్ద ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం దుబాయ్లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు ఆదేశాలు అందాయని, రూ. 40,000 కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. అతని వద్ద నుంచి ఒక సీసీ కెమెరా, ఇంటర్నెట్ వైఫై రూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బల్జీత్ సింగ్తో పాటు విక్రమ్జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరన్ప్రీత్ సింగ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెట్వర్క్ అంతర్జాతీయ సంబంధాలు, నిధుల మూలాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
పంజాబ్లో పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న గూఢచర్య ముఠాలు పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. గత నెలలోనే ఇలాంటి రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాలో తయారైన సోలార్ పవర్డ్, 4జీ సిమ్ ఆధారిత సీసీ కెమెరాలను ఉపయోగించి సైనిక స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్కు పంపుతున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.
జలంధర్లో సుఖ్విందర్ సింగ్ను అరెస్ట్ చేయగా, కపుర్తలాలో సోనా, సందీప్ సింగ్లను పట్టుకున్నారు. కపుర్తలాలో నిందితులు ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో నిఘా కోసం ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు. కెమెరా ఏర్పాటు కోసం పాకిస్థాన్కు చెందిన 'ఫౌజీ' అనే హ్యాండ్లర్ వీరికి రూ. 35,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడు సందీప్ సింగ్ డ్రోన్ల ద్వారా వచ్చిన కిలో హెరాయిన్ను పంపిణీ చేసినందుకు రూ. 50,000 తీసుకున్నట్లు కూడా అంగీకరించాడు. ఈ వరుస ఘటనలతో సరిహద్దు రాష్ట్రంలో భద్రతా ఏజెన్సీలు మరింత అప్రమత్తమయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జీత్ సింగ్ అలియాస్ బిట్టు పఠాన్కోట్-జమ్మూ జాతీయ రహదారి-44పై ఉన్న ఒక వంతెన సమీపంలోని దుకాణంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే ఆర్మీ వాహనాల కదలికలను నిరంతరం గమనించి, ఆ వీడియో ఫుటేజ్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాకిస్థాన్లోని ఆపరేటివ్లకు పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి దల్జీందర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
విచారణలో బల్జీత్ సింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. జనవరిలో సుజాన్పూర్ సమీపంలోని హైవే వద్ద ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం దుబాయ్లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు ఆదేశాలు అందాయని, రూ. 40,000 కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. అతని వద్ద నుంచి ఒక సీసీ కెమెరా, ఇంటర్నెట్ వైఫై రూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బల్జీత్ సింగ్తో పాటు విక్రమ్జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరన్ప్రీత్ సింగ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెట్వర్క్ అంతర్జాతీయ సంబంధాలు, నిధుల మూలాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
పంజాబ్లో పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న గూఢచర్య ముఠాలు పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. గత నెలలోనే ఇలాంటి రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాలో తయారైన సోలార్ పవర్డ్, 4జీ సిమ్ ఆధారిత సీసీ కెమెరాలను ఉపయోగించి సైనిక స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్కు పంపుతున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.
జలంధర్లో సుఖ్విందర్ సింగ్ను అరెస్ట్ చేయగా, కపుర్తలాలో సోనా, సందీప్ సింగ్లను పట్టుకున్నారు. కపుర్తలాలో నిందితులు ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో నిఘా కోసం ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు. కెమెరా ఏర్పాటు కోసం పాకిస్థాన్కు చెందిన 'ఫౌజీ' అనే హ్యాండ్లర్ వీరికి రూ. 35,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడు సందీప్ సింగ్ డ్రోన్ల ద్వారా వచ్చిన కిలో హెరాయిన్ను పంపిణీ చేసినందుకు రూ. 50,000 తీసుకున్నట్లు కూడా అంగీకరించాడు. ఈ వరుస ఘటనలతో సరిహద్దు రాష్ట్రంలో భద్రతా ఏజెన్సీలు మరింత అప్రమత్తమయ్యాయి.